Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!
Sai Pallavi: సాయిపల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందారు.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా మొదటి సినిమా అద్భుతమైన విజయం కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే సాయిపల్లవి తాజాగా విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు తనకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన కూడా లేదని తెలిపారు. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో కూడా తాను ఎంతో అసంతృప్తిగా సినిమాల్లో నటించానని అయితే ఈ సినిమా మంచి విజయం అందుకొని అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టానని తెలిపారు.
ఇక తనకు సినిమా అవకాశాలు రాకపోతే తన చేతిలో ఎలాగో డాక్టరేట్ ఉందని తాను వైద్య వృత్తిలో స్థిరపడతానని తెలియజేశారు.ఇక సాయి పల్లవి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు డబ్బుకు లోటు లేకుండా పెంచారని అయితే డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు చేయాలో కూడా నేర్పించారని తెలిపారు.
ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది మనకు ఎంతవరకు అవసరం అవుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే చిన్నప్పటినుంచి తాను ఏ వస్తువు కొన్నా తల్లి చేతుల మీదుగా కొనడం తనకు అలవాటు అని ఇప్పటికీ తను ఏం కొన్నా కూడా తన తల్లికి ఓటీపీ ద్వారా తెలిసిపోతుందని సాయి పల్లవి తెలియజేశారు. ఈ విధంగా తను అగ్రనటిగా కొనసాగుతున్నప్పటికీ తల్లిచాటు బిడ్డ నేనంటూ సాయి పల్లవి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…