Connect with us

Featured

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi: సాయిపల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందారు.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల

Published

on

Sai Pallavi: సాయిపల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందారు.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా మొదటి సినిమా అద్భుతమైన విజయం కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!
Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఇకపోతే సాయిపల్లవి తాజాగా విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు తనకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన కూడా లేదని తెలిపారు. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో కూడా తాను ఎంతో అసంతృప్తిగా సినిమాల్లో నటించానని అయితే ఈ సినిమా మంచి విజయం అందుకొని అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టానని తెలిపారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!
Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఇక తనకు సినిమా అవకాశాలు రాకపోతే తన చేతిలో ఎలాగో డాక్టరేట్ ఉందని తాను వైద్య వృత్తిలో స్థిరపడతానని తెలియజేశారు.ఇక సాయి పల్లవి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు డబ్బుకు లోటు లేకుండా పెంచారని అయితే డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు చేయాలో కూడా నేర్పించారని తెలిపారు.

ఇప్పటికీ తల్లిచాటు బిడ్డనే..

ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది మనకు ఎంతవరకు అవసరం అవుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే చిన్నప్పటినుంచి తాను ఏ వస్తువు కొన్నా తల్లి చేతుల మీదుగా కొనడం తనకు అలవాటు అని ఇప్పటికీ తను ఏం కొన్నా కూడా తన తల్లికి ఓటీపీ ద్వారా తెలిసిపోతుందని సాయి పల్లవి తెలియజేశారు. ఈ విధంగా తను అగ్రనటిగా కొనసాగుతున్నప్పటికీ తల్లిచాటు బిడ్డ నేనంటూ సాయి పల్లవి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!