Saipallavi:సాయి పల్లవి ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె తెలుగులో ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే అందరిని తన నటనతో డాన్స్లతో ఫిదా చేశారు. ఇలా సహజ సిద్ధంగా నటిస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేసుకుంటూ పోతున్నటువంటి సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఈమె గత ఏడాది గార్గి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు దీంతో సాయి పల్లవి ఇండస్ట్రీకి దూరమవుతారని పెళ్లి చేసుకుంటున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.అయితే గత ఏడాది నుంచి కూడా పెద్దగా ఎక్కడ ఇంటర్వ్యూలకు హాజరు కానటువంటి సాయి పల్లవి తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన గురించి కొన్ని విషయాలను తెలియచేశారు. తనకు ప్రేమమ్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా భయపడ్డానని తెలిపారు. తన ముఖంపై మొటిమలు ఉండడం అలాగే తన గొంతు కూడా బాగా లేకపోవడంతో నేను సినిమాలో నటిస్తే అందరూ ఆదరిస్తారా అనే భయం తనని వెంటాడిందని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ అయింది.
ఈ సినిమా మంచి హిట్ అవడంతో ప్రేక్షకులు నన్ను ఆదరించారని తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే ఈ సినిమాలో తాను ఎలాంటి మేకప్ వేసుకోలేదు తనకు మేకప్ వేసుకోవడం చాలా ఇన్ సెక్యూర్ గా ఉంటుందని తెలియజేశారు. నేను మేకప్ వేసుకోను అని చెప్పినప్పుడు కూడా డైరెక్టర్లు ఈ విషయంలో తనని బలవంతం చేయలేదని తెలిపారు. ఇలా మేకప్ లేకుండా నటించిన ప్రేమమ్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవడంతో అప్పటినుంచి తాను మేకప్ వేసుకోవడం లేదని ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…