తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. గత నాలుగు సంవత్సరాల క్రితం వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని ఈ క్రమంలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు వీరి విడాకుల విషయంపై ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ వీరు మాత్రం వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సమంత ప్రస్తుతం ఒంటరిగా చెన్నైలో తన స్నేహితులతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన మెసేజ్ కార్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సమంత ఇలా పోస్టులు పెట్టడం వెనుక కారణం ఏమిటి… తను డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా చైతన్యకు మెసేజ్ ల రూపంలో తన మనసులోని భావాలను చెబుతోందా.. లేక క్యాజువల్ గానే ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టిందా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో భాగంగా.. నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. నేను నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు.. ఇలా ఒకరికొకరం బాధ పెట్టుకుని ఉన్నప్పటికీ రియాలిటీ మాత్రం ఇదే… వసంతకాలం రావాలంటే అంతకు ముందు వచ్చే శిశిరాన్ని కూడా భరించాల్సి ఉంటుందనే మెసేజ్ కార్డులు పెట్టడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆలోచనలో పడేసాయి.
ప్రస్తుతం సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత ఈ విధమైనటువంటి మెసేజ్ చేయడం వెనుక కారణం ఏమిటి?తన భావాలను తన మనసులోని మాటలను ఇలా సమంత తన భర్తకు చేరవేయాలనుకుంటుందా అసలు ఏం జరుగుతోంది అంటూ అభిమానులు మరోసారి ఆలోచనలో పడ్డారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…