Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన ఎన్నో సినిమాలలో విలన్ గా కమెడియన్ గా సహాయ నటుడిగా నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన సెలెబ్రెటీల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది అభిమానులు సరాసరి వారి అభిమానులతో మాట్లాడుతున్నారు. అయితే కొందరు వారి లిమిట్ క్రాస్ చేసి మరి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం వారి సినిమాలు నటన వరకు మాత్రమే మాట్లాడాలి కానీ ఇలా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం సమంజసం కాదంటూ ఈయన పేర్కొన్నారు.
ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ ఎంతో బాధ పెడుతుంటారని అందుకు మంచి ఉదాహరణ సమంత అంటూ సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇలా విడిపోయిన అనంతరం ఎంతోమంది సమంత పై ఎన్నో మాటలు అంటూ తనని దారుణంగా బాధపెట్టారు.
ఇకపోతే ఒక నెటిజన్ ఏకంగా విడాకులు తీసుకున్న తర్వాత 250 కోట్ల భరణం తీసుకున్నావంటూ కామెంట్ చేశారు. ఇలా తన గురించి ఏమాత్రం తెలియకుండా ఇలా కామెంట్ పెట్టేయడంతో ఈ విషయంపై సమంత స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్ చూసిన బ్రహ్మజీ ఎంతో బాధపడుతూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యానని ఈ సందర్భంగా వెల్లడించారు. అవకాశం ఉంది కదా అని సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీల విషయంలో నెటిజన్ లు స్పందించే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…