Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన ఎన్నో సినిమాలలో విలన్ గా కమెడియన్ గా సహాయ నటుడిగా నటిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఇకపోతే ఈ సందర్భంగా ఈయన సెలెబ్రెటీల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది అభిమానులు సరాసరి వారి అభిమానులతో మాట్లాడుతున్నారు. అయితే కొందరు వారి లిమిట్ క్రాస్ చేసి మరి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం వారి సినిమాలు నటన వరకు మాత్రమే మాట్లాడాలి కానీ ఇలా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం సమంజసం కాదంటూ ఈయన పేర్కొన్నారు.
ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ ఎంతో బాధ పెడుతుంటారని అందుకు మంచి ఉదాహరణ సమంత అంటూ సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే నటుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇలా విడిపోయిన అనంతరం ఎంతోమంది సమంత పై ఎన్నో మాటలు అంటూ తనని దారుణంగా బాధపెట్టారు.
ఇకపోతే ఒక నెటిజన్ ఏకంగా విడాకులు తీసుకున్న తర్వాత 250 కోట్ల భరణం తీసుకున్నావంటూ కామెంట్ చేశారు. ఇలా తన గురించి ఏమాత్రం తెలియకుండా ఇలా కామెంట్ పెట్టేయడంతో ఈ విషయంపై సమంత స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్ చూసిన బ్రహ్మజీ ఎంతో బాధపడుతూ ఈ విషయంపై రియాక్ట్ అయ్యానని ఈ సందర్భంగా వెల్లడించారు. అవకాశం ఉంది కదా అని సెలబ్రిటీల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీల విషయంలో నెటిజన్ లు స్పందించే తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…