ఇటీవల సమంత, నాగచైతన్యకు సంబంధించి విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఒకొక్కరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అస్సలు ఇంత క్యూట్ గా ఉండే ఈ జంట విడిపోవడానికి గల కారణం ఏంటనేది చాలామంది విశ్లేషిస్తున్నారు.
ఇందులో సమంత కొన్ని రోజుల క్రితం నాగచైతన్యకు చెప్పకుండా గోవా టూర్ కి వెళ్లిందని.. ఫోన్ చేసినప్పుడు తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ అబద్ధం చెప్పారని.. దీంతో నాగచైతన్య తీవ్ర మనస్థాపం చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అక్కడ ఆమె తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
వాటిని చూసిన తర్వాతనే చైతు ఈ నిర్ణయానకి వచ్చినట్లు తెలిసింది. ఇదంతా ఇలా ఉండగా.. విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. ఆమె తన మనోభావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్టులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అతడు ఆమె విడాకుల అనంతరం చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. కొన్ని నిమిషాల్లోనే వాటిని డిలీట్ చేయడంతో చర్చ మరింత వేడి ఎక్కింది.
సమంతకు అన్యాయం జరిగినట్లు ఆ ఫొటోల్లో కనిపించింది. అతడు డిలీట్ చేసిన దాంట్లో విడాకులకు దారి తీయడానికి గల కారణం వెల్లడించినట్లు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమంతపై వేధింపులు, సామాజిక ఒత్తిడి కారణంగానే విడాకుల దాకా దారి తీసిందా అనే అనుమానాలకు కూడా తావిస్తోంది. సమాజంలో పేరున్న వ్యక్తులను ట్రోలింగ్ రూపంలో మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉందంటూ అతడు పోస్ట్ చేశాడు. అది ఎవరినీ ఉద్దేశించి చేశాడో తెలియదు కానీ.. అతడు డిలీట్ చేసిన దాంట్లో ఏదో ఉందంటూ ఆ విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…