Samantha: సమంత చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.గత కొంతకాలంగా ఈమె మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉన్నారు.ఇలా సమంత ఒకవైపు చికిత్స తీసుకుంటూనే ఈమె నటించిన యశోద సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి చేశారు.
అదేవిధంగా పాన్ ఇండియా స్థాయిలో సమంత ప్రధాన పాత్రలో పౌరాణిక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా సమంత బెడ్ పై నుంచి పూర్తి చేశారని తెలుస్తోంది.అయితే ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు.
సమంత తాజాగా శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సమంతను చూసిన అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమానికి సమంత తెలుపు రంగు చీర ధరించడమే కాకుండా చేతికి రుద్రాక్ష మాల కూడా ధరించడంతో అందరి దృష్టి సమంతపై పడింది.
సమంతా ఏంటి ఇలా రుద్రాక్ష మాల పట్టుకొని ఇలా పూర్తిగా మారిపోవడానికి గల కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎక్కువగా జాతకాలు న్యూమరాలజీలను నమ్ముతారు. సమంత కూడా అనారోగ్యం పాలవడంతో ఈమె కూడా ఇలాంటి వాటిని నమ్ముతున్నారా అందుకే ఇలా మారిపోయారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…