Sarojini Devi : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు అప్పటి విషయాలను చెప్పారు.
చంద్రబాబు నాయుడు దాదాపు మూడు గంటలు మాట్లాడారు…
ప్రత్యూష మరణం సమయంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ప్రత్యూష మృతిపై పలు సందేహాలు ఉండడంతో కేసు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ సరోజినీ దేవి గారు పలుమార్లు ఆరోపించారు. ఇక అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, నటుడు రాజకీయానాయకుడు అయిన మురళి మోహన్ ద్వారా సరోజినీ గారిని పిలిపించారట. దాదాపు మూడు గంటలసేపు సరోజినీ దేవి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు.
చంద్రబాబు ఇంకేమైనా కావాలంటే అడగండి అని చెప్పినా సరోజినీ గారు కేవలం న్యాయం చేయండి, నేను నా కొడుకును పెంచగలను నాకు ఉద్యోగం ఉంది కానీ నా కూతురు మృతికి నాకు న్యాయం కావాలి అని అడిగారట. ఇక ప్రత్యూష దహన సంస్కారాలు ముగిసి తిరిగి భువనగిరి నుండి హైదరాబాద్ వచ్చేసరికి సాక్ష్యాధారాలను తారుమారు చేశారంటూ సరోజినీ దేవి చెప్పారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…