Sarpanch Navya : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.
నా భర్తను ట్రాప్ చేసారు… నాతో వ్యభిచారం చేయిస్తారు…
ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య తన భర్తకు మాయమాటలు చెప్పి నాకు నా భర్తకు గొడవలు పెట్టారు అంటూ నవ్య ఆరోపించారు. నా భర్తను నమ్మించి నాతోనూ నా భర్త తోనూ 25 లక్షల అప్పు తీసుకుంటున్నట్లు గతంలో ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని సంతకం చేయమని ఒత్తిడి చేసారు అంటూ నవ్య ఆరోపించారు. నా భర్తను ఒక మహిళా అధికారి ద్వారా ఎమ్మెల్యే ట్రాప్ చేయించాడు అంటూ నవ్య తెలిపారు.
ఒక మహిళా అధికారిని మధ్యవర్తిగా పెట్టి ఇదంతా ఎమ్మెల్యే చేసాడు అంటూ నవ్య ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం డబ్బు శాంక్షన్ చేస్తానని చెప్పి మాకు ఎమ్మెల్యే అప్పుగా ఇస్తున్నట్లు ఇప్పుడు మాట మార్చారు అంటూ చెప్పారు నవ్య. డబ్బు కోసం ఇలాంటి వాటిని నేను చేయలేను. నా భర్తను కూడా నా మీదకు ఉసిగొల్పుతున్నారు, చివరకు నన్ను చంపితే 40 లక్షలు ఇస్తాం అని చెప్పినా నా భర్త వాళ్ళ మాటలను వినేలా ఉన్నాడు. వాళ్ళ ట్రాప్ లో పడుంటే భవిష్యత్తు లో నన్ను బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచారం కూడా చేయిస్తారు అంటూ, నేను న్యాయం కోసం పోరాడుతున్నా, ఎవరికీ భయపడేది లేదని నవ్య ఫైర్ అయ్యారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…