Sarpanch Navya : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.
నా భర్తను ట్రాప్ చేసారు… నాతో వ్యభిచారం చేయిస్తారు…
ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య తన భర్తకు మాయమాటలు చెప్పి నాకు నా భర్తకు గొడవలు పెట్టారు అంటూ నవ్య ఆరోపించారు. నా భర్తను నమ్మించి నాతోనూ నా భర్త తోనూ 25 లక్షల అప్పు తీసుకుంటున్నట్లు గతంలో ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని సంతకం చేయమని ఒత్తిడి చేసారు అంటూ నవ్య ఆరోపించారు. నా భర్తను ఒక మహిళా అధికారి ద్వారా ఎమ్మెల్యే ట్రాప్ చేయించాడు అంటూ నవ్య తెలిపారు.
ఒక మహిళా అధికారిని మధ్యవర్తిగా పెట్టి ఇదంతా ఎమ్మెల్యే చేసాడు అంటూ నవ్య ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం డబ్బు శాంక్షన్ చేస్తానని చెప్పి మాకు ఎమ్మెల్యే అప్పుగా ఇస్తున్నట్లు ఇప్పుడు మాట మార్చారు అంటూ చెప్పారు నవ్య. డబ్బు కోసం ఇలాంటి వాటిని నేను చేయలేను. నా భర్తను కూడా నా మీదకు ఉసిగొల్పుతున్నారు, చివరకు నన్ను చంపితే 40 లక్షలు ఇస్తాం అని చెప్పినా నా భర్త వాళ్ళ మాటలను వినేలా ఉన్నాడు. వాళ్ళ ట్రాప్ లో పడుంటే భవిష్యత్తు లో నన్ను బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచారం కూడా చేయిస్తారు అంటూ, నేను న్యాయం కోసం పోరాడుతున్నా, ఎవరికీ భయపడేది లేదని నవ్య ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…