దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎస్బీఐ కొత్త కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.
తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేర్వేరు డెబిట్ కార్డులపై ఏటీఎం విత్డ్రాయల్ పరిమితిని గతంతో పోలిస్తే భారీగా పెంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో విధించిన నిబంధనల వల్ల కొన్ని కార్డులకు రోజుకు 10,000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ మార్చిన నిబంధనల వల్ల ఎస్బీఐ ఖాతాదారులు రోజుకు 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు వాడే కార్డులను బట్టి పొందే ప్రయోజనాల్లో మార్పులు ఉంటాయి. ఎస్బీఐ క్లాసిక్, మేస్ట్రో డెబిట్ కార్డుపై 20,000 రూపాయల వరకు విత్ డ్రాయల్ పరిమితి పెరిగింది. ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుకు మాత్రం ఎస్బీఐ విత్ డ్రాయల్ పరిమితిని ఏకంగా లక్ష రూపాయలకు పెంచింది. ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేసే కస్టమర్లకు ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
మరోవైపు ఎస్బీఐ డెబిట్ కార్డ్ ద్వారా ఎంపిక చేసిన కస్టమర్లు రుణాలు పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎస్బీఐ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…