కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు కాగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కరోనా వల్ల పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వాళ్లంతా పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఈ నెల 29 నుంచి జనవరి నెల 7వ తేదీ వరకు మంచి మూహూర్తాలు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కేంద్రం పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులు హాజరు కావాలని సూచనలు చేసింది. అయితే పండితులు జనవరి 7 తర్వాత దాదాపు 4 నెలల పాటు మూహూర్తాలు లేవని తెలుపుతున్నారు. పెళిళ్లు చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
మంచి మూహూర్తాలు ఉండటంతో గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలకు ఇదే మంచి సమయమని పండితులు సూచిస్తున్నారు. 2021 జనవరి 16 నుంచి ఏప్రిల్ 30 వరకు మౌఢ్యమి ఉంది. మౌఢ్యమి వల్ల చాలామంది 7వ తేదీలోపు శుభకార్యాలు జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పండితులు పెళ్లిళ్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతుండటంతో బిజీ అయిపోయారు.
మరోవైపు పరిమిత సంఖ్యలోనే వివాహ వేడుకలకు బంధుమిత్రులు హాజరు కానుండటంతో చాలామంది పెద్దపెద్ద ఫంక్షన్ హాల్స్ కు బదులుగా చిన్న ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి వల్ల పెళ్లిళ్ల ఖర్చులు సైతం భారీగా తగ్గిపోతాయని సమాచారం
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…