ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కరోనా బారినపడిన యజమానులు వారి ఇళ్లల్లో పెంచుకుంటున్న పిల్లులు, కుక్కలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తాజాగా యూరోపియన్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజస్ కు చెందిన బృందం ఈ ఏడాది చేసిన పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనలో భాగంగా నెదర్లాండ్స్కు చెందిన ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం కోవిడ్ సోకిన వారి ఇళ్లలోని పెంపుడు కుక్కలకు, పిల్లుల రక్త నమూనాలను,గొంతు నుంచి స్వాబ్ను సేకరించి పీసీఆర్, యాంటీబాడీ పరీక్షలను నిర్వహించగా అందులో 4.2శాతం పీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 17.4శాతం రక్తంలోయాంటీబాడీలు కనిపించాయి.
ఈ విధంగా జంతువులలో కరోనా వ్యాప్తి చెంది నయం అయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే కరోనా సోకిన యజమానుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఆ జంతువులతో పాటు నివసించే మరిన్ని జంతువులకు పరీక్షలు నిర్వహించగా వాటికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాలేదు.అంటే జంతువుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందదు కేవలం మనుషుల నుంచే జంతువులకు కరోనా వ్యాప్తి చెందుతుందని ఈ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు.కనుక కరోనా బారిన పడిన వారు పెంపుడు జంతువులకు కూడ దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…