Senior Actor Chandhramohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలలో ఒదిగి పోయి ఆతరం నటులతోను ఇటు ఈ తరం నటులనతోను అందరితోనూ నటించిన వ్యక్తిగా చంద్ర మోహన్ నిలిచిపోయారు. ఇంకొంచం పొడవు ఉండి ఉంటే చంద్ర మోహన్ ఒక పెద్ద హీరో అయ్యేవాడు అంటూ నాగేశ్వరావు గారు స్వయన అనడం చంద్ర మోహన్ గారి నటనకు అవార్డు లాంటిది. అప్పట్లో అగ్రహీరోలకు సమానంగా సినిమాలను చేస్తూ హిట్లు కొట్టారు చంద్ర మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కెరీర్ కి సంబంధిచిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
శోభన్ బాబు బలిసిందా అనేసరికి…..
చంద్ర మోహన్ గారు సినిమాల్లో నటించే సమయంలో కృష్ణ, మోహనబాబు కూడా ఒకే సమయానికి వచ్చారంటు అందరితోనూ మంచి స్నేహం ఉండేదాంటూ చెప్పాడు. ఇక శోభన్ బాబు గారితో ఎక్కువ స్నేహం ఉండేదాంటూ ఏరా అని పిలుచుకునే స్నేహం మాది అంటూ వివరించారు. అందరూ చెన్నై నుండి హైదరాబాద్ కి తరలి వెళ్లిన సమయంలో నేను శోభన్ బాబు మాత్రం వెళ్ళలేదు అంటూ చెప్పారు. శోభన్ బాబు చెప్పడం వల్లే నేను వెళ్ళలేదని షూటింగ్ లు ఉంటే మాత్రం వెళ్లి హైదరాబాద్ వచ్చేవాడిని అంటూ చంద్ర మోహన్ చెప్పారు.
ఇక అలా చెన్నై లో ఇద్దరమే ఉండేసరికి మరింత స్నేహం బలపడింది. వారం లో ఒకరోజు ఇద్దరం కలిసి అన్ని మాట్లాడుకునేవాళ్లం అంటూ చెప్పారు. ఇక ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు శోభన్ బాబు అనేసరికి ఎరా బలిసిందా అంటూ అరిచాడు ఏమైంది అంటే ఎరా అనకుండా ఊరికే శోభన్ బాబు అంటావా అని అన్నాడు. నీ కుటుంబ సభ్యులు పనివాళ్ళ ముందు ఎందుకు అని అలా అన్నాను అంటే నువ్వు నేను చనిపోయే వరకు ఎరా అనే పిలుచుకోవాలి అందులో మార్పు లేదు అంటూ చెప్పేవాడంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…