Senior Actor Chandhra Mohan : మల్లంపల్లి చంద్ర శేఖర్ రావుగా తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన చంద్ర మోహన్ గారు అనతి కాలంలోనే హీరోగా మంచి చిత్రల్లో నటించిన గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగానే కాకుండా , సహా నటుడుగా, కమెడియన్ గా ఎలా ఎన్నో పాత్రలు చేసిన చంద్ర మోహన్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా పెద్దగా కనిపించక పోయిన ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ఆయన కెరీర్ లో ఉన్న మధుర,చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.
శోభన్ బాబు మృతి నన్ను బాధించింది…
సమాకాలిన నటులందరితోను మంచి స్నేహ సంబంధాలు ఉన్న చంద్ర మోహన్ గారు , శోభన్ బాబు గారితో ఎక్కువ స్నేహం ఉండేదంటూ చెప్పారు. వాళ్లిద్దరు ఏరా అని పిలుచుకునే వారట. చెన్నై నుండి తెలుగు ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడే ఉండటం వల్ల వారి స్నేహం మరింత బలపడింది. ఇక శోభన్ బాబు సడన్ గా మరణించడంతో చాలా బాధపడ్డాంటూ ఆనాటీ సంఘటనలను గుర్తు చేసుకుని చంద్ర మోహన్ గారు ఎమోషనల్ అయ్యారు. మరణించడానికి ఒక రోజు ముందు ఫోన్ చేసి రేపు ఉదయం 11 గంటలకు ఇంటికి రా మాట్లాడాలి అనగా, 11 తరువాత కదా అని చంద్ర మోహన్ గారు ఉండగా మీడియా నుండి ఎవరో ఫోన్ చేసి శోభన్ బాబు గారి ఇంట్లో ఏదో ఆపశృతి జరిగిందని విన్నాము మీకు తెలుసా అన్నారు నేను ఏమైంది అంటే విషయం మాకు తెలియదు అనగానే నేను వెంటనే శోభన్ బాబు వల్ల ఇంటికి వెళ్లగా ఇల్లు నిర్మానుష్యంగా ఉంది ఇంట్లో వాళ్ళు దిగాలుగా కూర్చున్నారు అంటూ చెప్పారు .
ఏమయిందని ఇంట్లోవాళ్ళను అడిగితే పేపర్ చదువుతూ ఉన్నట్లుండి మెట్లమీద నుండి పడిపోయారని చెప్పారు. అంబులెన్సు లో హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పగానే షాక్ అయ్యను. తెరుకునే లోపే శవాన్ని ఇంటికి తీసుకువచ్చేసారు. ఇంటి నుండి తీసుకు వెళ్ళేటప్పుడే ఆయన మరణించాడని చెప్పారు అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్ర మోహన్. రోజు మాట్లాడుకునేవాళ్ళం సరదాగా కబుర్లు చెప్పుకున్న వన్నీ గుర్తొచ్చి శవం చూడగానే పడి ఏడ్చేసాను అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్ర మోహన్. ఇక శోభన్ బాబు కొడుకు చంద్ర మోహన్ గారిని అప్పుడప్పుడు ఇంటిక వచ్చి వెళ్ళండి అని చెప్పినా అక్కడికి వెళితే మేము కూర్చొని మాట్లాడిన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇంకా బాధేస్తుంది రాను చెప్పి వచ్చేసారట చంద్ర మోహన్ గారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…