Senior Actor Chandhra Mohan : మల్లంపల్లి చంద్ర శేఖర్ రావు అంటే ఎవరికీ తెలియదు కానీ చంద్ర మోహన్ అంటే మాత్రం అందరికి తెలుసు. హీరోగా, సహా నటుడుగా, కమెడియన్ గా ఎలా ఎన్నో పాత్రలు చేసిన చంద్ర మోహన్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా పెద్దగా కనిపించక పోయిన ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ఆయన కెరీర్ లో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
శ్రీదేవి ని ఐరన్ లెగ్ అన్నారు…. దాదాపు చాలా మంది హీరోయిన్స్ తో చేసాక….
చంద్ర మోహన్ గారు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే అప్పట్లో ఆయనతో మొదటి సారి నటించిన హీరోయిన్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ అవుతుంది అనే పేరుండేది. ఆయనతో తొలిసారి నటించిన శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, మాధవి లాంటి ఎంతోమంది హీరోయిన్స్ ఆ తరువాత అగ్ర హీరోయిన్లు గా ఏదిగారు. ఇక ఈ విషయం గురించి చంద్ర మోహన్ గారు మాట్లాడుతూ శ్రీదేవి ని మొదట పదహరేళ్ళ వయసు సినిమాకు వద్దని అనుకున్ననారు వేరే అమ్మాయిని అనుకున్న సమయంలో తమిళంలో ఆల్రడీ తానే చేసింది కానీ ఆమె నటించిన సినిమాలు కొన్ని ప్లాప్ అవడం వల్ల వద్దని ఐరన్ లెగ్ అని వద్దనుకున్న శ్రీదేవి వాళ్ళ అమ్మ చాలా అడిగి ఒప్పించుకున్నారు.
కానీ ఆ సినిమా తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అగ్ర హీరోయిన్ గా హిందీ సినిమా వైపు కూడా వెళ్లి అక్కడ నెంబర్ వన్ అయింది. కానీ అంత పై స్థాయికి వెళ్లిన కూడా ఒకసారి నేను కనబడితే కాళ్ళకు నమస్కారం చేసి పక్కన అమితాబ్ బచ్చన్ గారికి నన్ను పరిచయం చేస్తూ నా మొదటి సినిమా హీరో, ఈయన సినిమాలో చేశాకే నేను స్టార్ హీరోయిన్ అయ్యాను అంటూ చెప్పారు. గేట్ వే ఆఫ్ హీరోయిన్స్ ఈయన అంటు శ్రీదేవి నే మొదట ఆ సెంటిమెంట్ గురించి చెప్పింది అంటూ చంద్ర మోహన్ గారు పంచుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…