Senior actress Roja Ramani : తమిళ నట పుట్టి భక్త ప్రహల్లాద సినిమాతో బాల నటిగా జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న రోజా రమణి గారు పెద్దయ్యాక హీరోయిన్ గా, హీరోలకు చెల్లిగా అనేక సినిమాలలో నటించింది. ఇక ఒరియా నటుడైనా చక్రపాణిని వివాహం చేసుకున్న రోజా రమణి గారికి తరుణ్ అలాగే అమూల్య లు సంతానం. ఇక తెలుగు ప్రజలకు హీరో తరుణ్ సుపరిచితుడే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాలను పంచుకున్నారు.
హరికృష్ణ గారు లేకపోతే ఈరోజు…
రోజా రమణి గారు హీరో చెల్లిగా నటిస్తూ ఉన్న సమయంలో ‘తాతమ్మ కల’ సినిమాలో ఎన్టీఆర్ కూతురుగా నటించిన రోజా రమణి గారు ఆ సినిమాలో హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరి తోనూ నటించారు. సినిమాలో రోజా రమణి గారు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి ఉండగా విజయవాడ బ్రిడ్జి మీద షూటింగ్ చేస్తుండగా కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తుండగా పై నుండి కిందికి దూకుతున్నట్లుగా కింద నుండి కెమెరా పెట్టి సీన్ చేస్తున్నారు. బ్రిడ్జి నుండి కిందకి నా మొహం సగం కనిపిస్తుండటంతో కొంచం ఎత్తు పెట్టాల్సి వచ్చింది. బ్రిడ్జ్ మీద కాసేపు ట్రాఫిక్ అపి ఆ సీన్ చేస్తుండటంతో ఎన్టీఆర్ గారిని చూడటానికి చాలా మంది అక్కడ గుమిగూడారు.
అలా ఉన్న ఒక నూనె వ్యాపారి వద్ద రెండు నూనె డబ్బాలను తీసుకుని వాటి మీద నన్ను నిలబడి నది లోకి పడినట్లుగా చేయమన్నారు. డైరెక్షన్ ఎన్టీఆర్ గారు చేస్తుండటం ఒకటైతే ఆ డబ్బాలు ఖాళీవి కావడంతో బాగా కదులుతున్నాయి, కాస్త అటు ఇటు అయితే నదిలో నిజంగానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒక అబ్బాయి పట్టుకున్నా డబ్బాలు కదులుతున్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న హరికృష్ణ గారు వచ్చి ఆ అబ్బాయిని పక్కకు తీయమని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని కూర్చున్నారట. ఆయన అలా చేయకపోయుంటే పడి పోయేదాన్ని నదిలోకి అందులోనూ ఆయన పట్టుకోనవసరం లేదు ఇంకెవరికైనా చెప్పుండొచ్చు కానీ అలా చేయలేదు అంటూ తెలిపారు రోజా రమణి.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…