Featured

Senior Journalist Imandhi Ramarao : చనిపోకముందే వీలునామా రాసిన కృష్ణ… ఎవరికి ఎంత రాశాడంటే?? : సీనియర్ జర్నలిస్ట్ ఇమాంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన మరణం తరువాత ఆస్తులు, హక్కులు అలాగే వీలునామా గురించిన చర్చ మొదలయింది. వీటి గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

ఎవరెవరికి ఎంత ఇస్తారంటే…

కృష్ణ గారి సంతానం రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు, పద్మావతి, ఇందిరా ప్రియదర్శిని. ముగ్గురు ఆడపిల్లలను మంచి కుటుంబాలకు ఇచ్చి పెళ్లి చేసిన కృష్ణ గారు కొడుకులుద్దరినీ సినిమా రంగంలోకి పంపినా రమేష్ బాబు గారు నిలదొక్కుకోలేకపోయారు. ఇక ఆయన వ్యాపార రంగంలోకి వెళ్లిపోయినా మహేష్ మాత్రం అగ్ర హీరోగా ఎదిగాడు. ఇక రమేష్ బాబు గారు అనారోగ్య కారణాలతో మరణించడంతో కృష్ణ గారికి రమేష్ కుటుంబం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకే కృష్ణ గారు మరణించక ముందే వీలునామా లో ఎవరెవరికి ఏ ఆస్తులు ఇవ్వాలో రాసినట్లు ఇమందిగారు అభిప్రాయపడ్డారు.

మొదట రమేష్ కుటుంబానికి, అలానే మొత్తం మనవళ్లు, మనవరాళ్ల కు ఇక మహేష్ ఫ్యామిలీ కి అలానే కూతుర్లకు అన్నట్లుగా ఆయన పంపకాలు ఉండొచ్చు అంటూ చెప్పారు. ఇక నరేష్ కి ఆస్తిలో వాటా అంటే ఆయనకు కృష్ణ ఫ్యామిలీ కి బ్లడ్ రిలేషన్ లేదు. విజయనిర్మల గారి కొడుకుగా మాత్రమే చూసారు. అయితే ఆవిడ మీద ప్రేమతో ఇల్లు ఏమైనా సెంటిమెంట్ గా ఇస్తే ఇవ్వచ్చు ఆది కూడా హక్కుగా కాదు అంటూ ఇమంది గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

27 minutes ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

57 minutes ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

1 hour ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

2 hours ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

22 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago