Senior Journalist Bhardwaja : అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో విడుదలయింది. మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు వచ్చారు. ఇక బాలకృష్ణ కు స్వయానా బావ అయిన చంద్రబాబు బాబు గారు అలాగే ఆయన తనయుడు లోకేష్ గారితో సరదా ప్రశ్నల్తో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలతో ప్రోమో కట్ చేసారు. ఇక ప్రోమో విడుదల అయిన కాసేపటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలబడి బాలయ్య బాబు అంటే ఏంటో చూపించింది. ఇక ఈ షోలో చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్నలు, ఇక ప్రోమోలో చూపించిన విషయాల మీద చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రోమో గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
నిజంగానే మంచి స్నేహితులు…
అన్ స్టాపబుల్ షోలో మీ ప్రాణ స్నేహితుడు ఎవరు అంటూ బాలయ్య చంద్రబాబు ని అడగడంతో చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పడం మనకు చూపిస్తారు. ఇక ఈవిషయం గురించి మాట్లాడుతూ భరద్వాజ గారు ప్రోమోలో ఎలా కట్ చేశారు మనకు తెలియదు నిజంగానే చంద్రబాబు వైస్సార్ పేరు చెప్పారో లేదో తెలియదు, ప్రోగ్రామ్ లో హైప్ కోసం అలా కట్ చెసి ఉండొచ్చు కూడా, కానీ ఇద్దరూ సమకాలిన నాయకులు, ఇద్దరి రాజకీయ జీవితం ఒకేసారి ఒకే పార్టీలో మొదలయింది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇద్దరూ మంచి మిత్రులు. ఇక చంద్రబాబు వైస్సార్ ను సలహాలు అడిగేవారు. అలా ఆయనకు పెళ్లి సంబంధాల విషయంలో కూడా సలహా అడుగగా ఎన్టీఆర్ గారి ఇంట్లో చేసుకోమని రాజశేఖర్రెడ్డి సలహా ఇచ్చాడట. అలా ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారు అంటూ భరద్వాజ చెప్పారు.
కొడాలి నాని కేసు వేయొచ్చు…
ఇక భరద్వాజ గారు మాట్లాడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఇంట్రడక్షన్ లో ఈ షో ఇండియా లోనే నెంబర్ గా నిలిచి అన్ని షోలకు అమ్మ మొగుడు అయింది అంటూ డైలాగు చెప్పారు. ఇక ఈ అమ్మ మొగుడు అనే డైలాగు ఏపీ వైస్సార్ సీపీ నాయకుడు కొడాలి నాని అంటుంటాడు. కాపీ రైట్స్ అతనికే ఉన్నాయి. కాబట్టి బాలకృష్ణ అతని డైలాగు చెప్పాడు కాబట్టి బాలయ్య మీద కేసు వేయొచ్చు. అయినా బాలకృష్ణ మీద కొడాలి నాని ప్రభావం ఎంతుందో అర్థమవుతుంది అంటూ భరద్వాజ గారు విశ్లేషించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…