Senior Journalist Bhardwaja : గుజరాత్ నుండి చిన్న వ్యాపారవేత్తగా మొదలయిన ఆదాని ప్రయాణం నేడు ప్రపంచం కుబేరుల జాబితాలో టాప్ 10 లోకి చేరింది. అయితే కొత్త సంవత్సరం టాప్ 10 లో ఉన్న ప్రపంచ కుబేరులలో కేవలం ఆదాని సంపద మాత్రమే తరిగి పోయి టాప్ ప్లేసులో ఉన్న తనకు ఏడో స్థానానికి దిగజారాడు. గత కొద్ది రోజులుగా స్టాక్ ఎక్స్చేంజ్ లో మోసాలకు పాల్పడినట్లు ఆదాని గ్రూప్ మీద వార్తలు వెలువడ్డాయి. ఇక ఈ సంఘటనల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అయన విశ్లేషణ ఇచ్చారు.
మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ రిపోర్ట్…
అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడినట్లు ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ దాదాపు రెండున్నరేళ్ల పాటు చేసిన పరిశోధనలలో, అదానీ గ్రూప్ తన స్టాక్స్లో భారీ అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు కూడా చేస్తోందని ఆరోపణలు గుప్పించింది. దశాబ్దాల కాలంగా స్టాక్ మానిపులేషన్ జరుగుతోందని, అకౌంటింగ్ ఫ్రాడ్, స్కామ్ జరుగుతోందని పరిశోధన రిపోర్ట్ను తాజాగా విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడడంతో ఒక్కసారిగా ఆదాని గ్రూప్ స్టాక్స్ పడిపోయి దాదాపు ఒక్కరోజులోనే 5.9 బిలయన్ డాలర్ల సంపద అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపుగా 49 వేల కోట్ల సంపద అవిరైపోయింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ విడుదల మమ్మల్ని సంప్రదించకుండా చేసారంటూ ఆదాని గ్రూప్ ఆరోపించింది. ఏ మాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి ఒక రిపోర్ట్ ను ప్రకటించి కావాలనే మా కంపెనీకి నష్టం చెకూర్చాలని భావిస్తున్నారంటూ ఆదాని పేర్కొనడం విడ్డూరంగా ఉందంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. మోసాలకు పాల్పడే వారు దొరికిపోయినపుడు చివరి అస్త్రంగా దొరికేది దేశభక్తి అయినట్లు ఆదాని కూడా జాతీయత గురించి మాట్లాడాడు. కావాలనే అమెరికన్ సంస్థ ఇలా చెస్తోందని, ఒక భారతీయుడు ఎదగడం నచ్చక ఇలా ప్రవర్తిస్తోంది అంటూ ఆరోపించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో నాథన్ అండర్సన్ పేర్కొన్న 90% అంశాలకు ఆదాని వద్ద సమాధానం లేదంటూ అభిప్రాయపడ్డారు భరద్వాజ గారు. వాటిని వివరించకుండా కేవలం జాతీయత, దేశభక్తి అంటూ ఆరోపించడం ఏంటి అంటూ విమర్శించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…