Singer Mano: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.గత పది సంవత్సరాలు క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.
ఈ కార్యక్రమం నుంచి నాగబాబు కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారు. అయితే ఈయన స్థానంలో సింగర్ మనో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఈయన కూడా కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అనంతరం తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోవడానికి గల కారణం మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సింగర్ మనో స్పందించారు.
ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ…తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం మల్లెమాల వారితో గొడవలు కాదని ఈయన తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కేవలం చిన్న విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు. కరోనా వల్ల కొన్ని షోలు వాయిదా పడ్డాయి.వీటిలో ఇళయరాజా ఏఆర్ రెహమాన్లతో కలిసి చేయాల్సిన షోలు ఉన్నాయని ప్రస్తుతం ఈ షో లతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.
ఇవి పూర్తి కాగానే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ఇలా జబర్దస్త్ విడిపోవడానికి ఈ షోలే కారణమని అంతకుమించి మరే ఇతర కారణాలు లేవని తెలిపారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తాను హాజరవుతాను అంటూ మనో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…