Singer Mano: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.గత పది సంవత్సరాలు క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.
ఈ కార్యక్రమం నుంచి నాగబాబు కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారు. అయితే ఈయన స్థానంలో సింగర్ మనో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఈయన కూడా కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అనంతరం తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోవడానికి గల కారణం మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సింగర్ మనో స్పందించారు.
ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ…తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం మల్లెమాల వారితో గొడవలు కాదని ఈయన తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కేవలం చిన్న విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు. కరోనా వల్ల కొన్ని షోలు వాయిదా పడ్డాయి.వీటిలో ఇళయరాజా ఏఆర్ రెహమాన్లతో కలిసి చేయాల్సిన షోలు ఉన్నాయని ప్రస్తుతం ఈ షో లతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.
ఇవి పూర్తి కాగానే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ఇలా జబర్దస్త్ విడిపోవడానికి ఈ షోలే కారణమని అంతకుమించి మరే ఇతర కారణాలు లేవని తెలిపారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తాను హాజరవుతాను అంటూ మనో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…