Senior Journalist Bhardwaja : టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కుట్రలో భాగంగా కారు బాంబు పేల్చి హతమార్చాలని ప్రయత్నించినపుడు జరిగిన సంఘటనలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు పంచుకున్నారు. అప్పటికే టీవీ బాంబ్ కేసులో జైల్లో ఉన్న మద్దెలచెరువు సూరి శిక్ష అనుభవిస్తున్నా జైలులో ఉంటూనే బయట తన శత్రువు పరిటాల రవి హత్యకు కుట్ర చేసారు. అయితే ఆ బాంబు పేలుడులో దాదాపు 24 మంది మరణించారు. ఎనిమిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు.
తృటిలో తప్పించుకున్న మోహన్ బాబు, పరిటాల రవి…
పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర సినిమాగా నిర్మించి శ్రీరాములయ్య సినిమా తీయించారు. అయితే ఈ సినిమా విడుదల వేడుక రామా నాయుడు స్టూడియో లో నానక్రామ్ గూడా లో జరిగింది. వేడుక అయిపోయాక తిరిగి వెళ్తున్న సమయంలో ల్యాండ్ మైన్ పేల్చి పరిటాల రవిని చంపడానికి కుట్ర చేసారు. జైలు నుండే తన అనుచరులతో కుట్రకు ప్లాన్ చేసిన సూరి అప్పుడే ఇంజనీరింగ్ అయిన ఒక విద్యార్థి ద్వారా ల్యాండ్ మైన్ ను తయారుచేయించి కారు వచ్చే చోట పెట్టారు.
కారులో పరిటాల రవి, మోహన్ బాబు, పరిటాల రవి గారి బావ కృష్ణ రావు అందరూ కారులో ఉండగా ఆ కారు కంటే ముందు మీడియా వాళ్ళు వెళ్తున్న వాహనం వాళ్ళను ఓవర్ టేక్ చేసి ల్యాండమైన్ మీద వెళ్లడం వల్ల ఆ కారు పేలి అందులో ఉన్న ఇరవై నాలుగు మంది మరణించారు. అలా 1997 లోనే మోహన్ బాబు ఆ కారు ప్రమాదంలో మరణించాల్సి ఉన్నా మీడియా వాళ్ళ వాహనం ఓవర్ టేక్ చేయడం వల్ల బ్రతికారు అంటూ అప్పటి ఇన్సిడెంట్ ను భరద్వాజ గారు చెప్పారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…