Senior Journalist Imandhi Ramarao : సినిమా టికెట్ ధరల గురించి కామెంట్స్ చేసిన నిర్మాత సురేష్ బాబు…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకవైపు టికెట్ ధరల విషయంలో చర్చలు సాగుతున్న మొన్నటి భోళా శంకర్ సినిమాకు కూడ ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాజాగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టికెట్ ధరల గురించి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.

టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వండి…

సురేష్ బాబు టికెట్ ధరల గురించి మాట్లాడుతూ వారంతాల్లో సినిమా టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఇవ్వాలి. అమెరికా వంటి దేశాల్లో వారంతాల్లో టికెట్ ధర పెంచుకుంటారు. అలాంటి పద్ధతి ఇక్కడ రావాలి అంటూ చేసిన వాఖ్యల గురించి ఇమంది గారు మాట్లాడుతూ అమెరికా లో సినిమాలను ఎక్కువగా చూడరు. ఇండియా లో ఉన్నట్లు సినిమా మీద ఆసక్తి అక్కడ ఉండదు. ఇక టికెట్ రేట్లు పెంచడం అనే విధానం అక్కడ ఉందని అనుకోవడం లేదు.

అయితే సురేష్ బాబు ఎందుకలా అన్నారో తెలియదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి సంబంధం లేదు ఎవరి పని వాళ్ళది కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది వారి సొంత పనుల కోసం సీఎంల వద్దకు వెళ్లడం సన్నిహితంగా ఉండటం వల్ల ఇండస్ట్రీ లోని విబేధాల కారణంగా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ వ్యవహారల ల్లోకి వేలు పెడుతోంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుండి ఏపీ ప్రభుత్వ పదవుల్లో ఉన్న పోసాని, అలీ ఇద్దరు ఎం చేస్తున్నట్లు అంటూ ప్రశ్నించారు.