Rajinikanth: తమిళ తలైవా రజినీకాంత్ స్టార్ డం గురించి చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రజినీకాంత్ హిమాలయాలకు వెళ్లి ఎంతోమంది యోగులను మునులను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే రజినీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. రజనీకాంత్ తనని కలవడానికి వస్తున్నారు అనే విషయం తెలియగానే యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకడానికి బయటకు వచ్చారు అయితే రజనీకాంత్ కారు దిగిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి రజనీకాంత్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఎంతో స్టార్డం ఉన్నటువంటి రజినీకాంత్ ఇలా తనకన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నవాడు అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడం ఏంటి అంటూ రజనీకాంత్ వ్యవహార శైలి పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఈ విషయం గురించి గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇకపోతే తాజాగా రజనీకాంత్ తన ట్రిప్ ముగించుకొని తిరిగి చెన్నై వచ్చారు. ఈ క్రమంలోనేఎయిర్ పోర్టులో మీడియా ఈ విషయం గురించి రజనీకాంత్ ను ప్రశ్నించడంతో ఆయన ఒకే ఒక్క మాటలో ఈ ప్రశ్నలకు ఈ విమర్శలకు సమాధానం ఇచ్చారు.ఈ విషయం గురించి రజనీకాంత్ మాట్లాడుతూ వయసులో తన కన్న చిన్నవారైనా సరే వారు యోగి లేదా స్వామీజీ అయితే తప్పకుండా వారి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటానని ఇది నా పద్ధతి అంటూ రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…