Senior Journalist Imandi Ramarao : చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కీర్తి సురేష్ చెల్లిగా హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ సినిమాకు చాలా రోజుల తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ కాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో సినిమాలో కొన్ని మార్పులను చేసి తీసిన చిరు అభిమానులకు సినిమా నచ్చలేదు. ఇక ఈ సినిమా ప్లాప్ అవడానికి గల కారణాలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.
సినిమా పొవడానికి కారణం అదే…
ఇమంది గారు సినిమా పొవడానికి గల కారణాలను గురించి మాట్లాడుతూ సినిమా మీద మొదటి నుండి వైసీపీ వాళ్ళు కావాలనే నెగెటివ్ ప్రచారం చేసారంటు చెప్పారు. సినిమా చూసాక యావరేజ్ గా అయితే ఆడుతుందని భావించిన బయటికి అందరూ సినిమా బాగోలేదని ప్రచారం చేయడం వల్ల చాలా మంది సినిమా చూడక ముందే సినిమా బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి నెగెటివ్ ప్రచారం వల్లే సినిమా కలెక్షన్స్ దెబ్బతిన్నాయని ఇమంది రామారావు తెలిపారు. ఇక తాజాగా భోళా శంకర్ సినిమా నిర్మాత నష్టాలను పుడ్చడానికి ఆస్తులను అమ్ముకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరోసారి చిరు సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినట్లయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…