Serial Actress Divya : పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఎంత కామన్ అయిపోయాయో అలాగే సహజీవనం అంటూ ఇద్దరు కలిసి ఉండటం, అలాంటి పార్టనర్ నమ్మి మోసపోవడం, పోలీసులను ఆశ్రయించడం వంటివి కూడా నేటి సమాజం లో కామన్ అయిపోయాయి. ఇక సినిమా, టీవి రంగంలో ఇలాంటివి కోకొల్లలు. తమిళ ఇండస్ట్రీ కి చెందిన ఒక టీవీ నటి కూడా ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను దూరం పెడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. వేరే అమ్మాయితో ఆఫైర్ నడుపుతున్నాడని కేసు పెట్టింది.
నా ముందే నా భర్త ను ముద్దు పెట్టుకుంది…
తమిళ సీరియల్స్ లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్య, ఆర్నవ్ అనే మరో సీరియల్ నటుడిని పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే దివ్య మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్నాక 2017 లో కిలాడి కన్మణి సీరియల్ లో నటించినపుడు ఆర్నవ్ తో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారిందని, అప్పటికే దివ్యకు విడాకులయి ఒక ఏడాది పాప కూడా ఉందని, ఆ తరువాత ఐదు సంవత్సరాలు సహజీవనం చేసాక ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి తరువాత లాక్ డౌన్ సమయంలో కూడా మొత్తం బాధ్యత తానే తీసుకున్నట్లు దివ్య పేర్కొన్నారు. తాను ఏ పని చేసేవాడు కాదని ఇద్దరం కలిసి ఇల్లు కొన్నా అందుకోసం తన నగలను అమ్మినట్లు దివ్య చెప్పారు.
తమ పెళ్లి విషయంలో కానీ ఫోటోలను కానీ బయట చూపించ వద్దని చెప్పేవాడు అంటూ, ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అయ్యాక దూరం పెడుతున్నాడని ఈ సమయంలోనే తాను వేరే అమ్మాయి తో ఎఫైర్ నడుపుతున్నట్లు తెలిసిందని దివ్య చెప్పారు. తను నటిస్తున్న సీరియల్ లో ఒక అమ్మయి తో ఆర్నవ్ కి ఎఫైర్ ఉందని నిలాదీయడానికి వెళితే ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటున్నారని తెలిసింది. అర్ణవ్ తో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కొట్టిందని తన ముందే ఆర్నవ్ కు ముద్దు కూడా పెట్టిందని దివ్య పేర్కొన్నారు. ఆర్నవ్ కోసం తన మతం మార్చుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని, తనకు కానీ తన కడుపులోని బిడ్డకు కానీ ఏదైనా హాని జరిగితే ఆర్నవ్ దే బాధ్యత అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…