Serial artist Nirupam Paritala : ఈటీవీలో చంద్రముఖి సీరియల్ తో పరిచయమైన నిరుపమ్ పరిటాల, రచయిత నటుడు ఓంకార్ పరిటాల కుమారుడు. ఓంకార్ గారు విలన్ గా నటించిన సీరియల్స్ అన్నీ హిట్ సీరియల్స్ గా నిలిచాయి. పలు సినిమాల్లోనూ నటించిన ఓంకార్ అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన వారసుడిగా అడుగుపెట్టిన నిరుపమ్ చంద్రముఖి సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే కో ఆర్టిస్ట్ మంజులతో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. నిరుపమ్ కెరీర్ ను మలుపు తిప్పిన సీరియల్ మాత్రం కార్తీక దీపం. అందులో డాక్టర్ బాబు పాత్రతో సుపరిచితుడైన నిరుపమ్ ను చాలామంది డాక్టర్ బాబు అంటూనే బయట గుర్తు పడతారు.
దీప గురించి బయట అడుగుతుంటారు…
నిరుపమ్ తాజాగా జీ తెలుగులో రాధకు నీవేరా ప్రాణం సీరియల్ లో నటిస్తున్నారు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సీరియల్ ప్రమోషన్స్ కోసం ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేస్తే అందరూ కార్తీక దీపం సీరియల్ గురించి అడిగారంటూ చెప్పారు. అందరూ వంటలక్క ఎక్కడ అని అడుగుతారు, నేను భార్య బయటికి వెళ్ళినపుడు కూడా దీప గురించి కొంతమంది అడుగుతుంటారు అయితే నా భార్య నవ్వుతుంటుంది అంతే అంటూ చెప్పారు.
ఇక తనకు కెరీర్ లో మంచి పేరు తెచ్చిపెట్టిన కార్తీక దీపం లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ రాదేమో అంటూ చెప్పారు. ఎన్ని చేసినా లైఫ్ లో అలాంటి హిట్ ఒకటే ఉంటుంది అది కార్తీక దీపం అంటూ చెప్పారు. ఇక రాధకు నీవేరా ప్రాణం సీరియల్ లో పోలీస్ పాత్రలో నన్ను మొదట అందరూ ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను కానీ సీరియల్ టాప్ రేటింగ్స్ లో ఉండటం సంతోషంగా ఉంది అంటూ చెప్పారు నిరుపమ్.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…