Featured

Analyst Damu Balaji : విజయసాయి రెడ్డి అన్ని పదవులనూ పీకి పక్కన పెట్టిన జగన్.. కారణం అదేనా..: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టినపుడు ఆయన పరిస్థితి బాగోలేదు. అయినా పార్టీ పెట్టి పదేళ్ళు పార్టీని నడిపి నేడు సీఎం అయ్యాడంటే జగన్ ఒక్కడివల్లే ఇదంతా సాధ్యపడలేదు. ఒక సమయంలో చెల్లి షర్మిల పాదయాత్ర చేసి అన్నను జనాలు మర్చిపోకుండా చేస్తే మరోవైపు విజయ్ సాయి రెడ్డి కుడి భుజంలా ఉంటూ ఆయన ప్రతి విషయలోనూ తోడున్నాడు. వ్యూహాలను రచిస్తూ పార్టీని నిలబెట్టడంలో జగన్ తో పాటు విజయ్ సాయి రెడ్డి కృషి ఎంతైనా ఉంది. అలాంటి విజయ్ సాయి గారిని ప్రస్తుత జగన్ పక్కన పెడుతున్నాడు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటి గురించి అనలిస్ట్ బాలాజీ తన అభిప్రాయాలను తెలిపారు.

అన్ని పదవులనూ దూరం చేసిన జగన్…

విజయ్ సాయి రెడ్డి గారు రాజ్య సభ మెంబెర్ గా ప్రస్తుతం ఉన్నారు. అయితే వైసీపీ పార్టీలో కీలక పదవులలో ఉండేవారు. ఆయన వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్తగా ఉండేవారు, తాజాగా ఇది వైవి సుబ్బారెడ్డి కి ఇచ్చారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా కమిట్ కి ఇంచార్జి గా ఉండేవారు, దీన్ని ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డికి ఇచ్చారు. ఇక వైసీపీ అనుబంధం విభాగల సమన్వయ కమిటీ చైర్మన్ గా కూడా ఉండేవారు. ఈ పదవి బాధ్యతలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు అంటూ బాలాజీ తెలిపారు.

అలా మూడు కీలకమైన పదవుల నుండి విజయ్ సాయి ని తొలగించడం వెనుక కారణం గురించి చర్చ మొదలయిందని తెలిపారు. విజయ్ సాయి కి వయసు ఎక్కువవడం వల్ల ఆయనను ఈ బాధ్యతల నుండి విముక్తున్ని చేస్తున్నట్లు జగన్ పార్టీ ప్లీనరీ కార్యక్రమంలో చెప్పినట్లు వినిపిస్తోందని బాలాజీ తెలిపారు. అదీ కాక మరోవైపు తారకరత్న మరణం సమయంలో జరిగిన పరిణామాల దృష్ట్యా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరూ చర్చించుకున్నట్లు తెలిపారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

7 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

7 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

7 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

7 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

7 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

8 hours ago