Latha Mangeshkar: లతా మంగేష్కర్ భౌతికదేహంపై షారుఖ్ ఖాన్ ఉమ్ము వివాదం..! కొంచమైనా బుద్దుందా అంటూ నటి ఫైర్ ..!
Latha Mangeshkar: షారుఖ్ ఖాన్ ఈ మధ్య ఏం చేసినా వివాదం అవుతోంది. వరసగా ఫ్లాప్ సినిమాలతో గత వైభవాన్ని కోల్పోయాడు. మరోవైపు సల్మాన్, ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లు వరసగా ప్రయోగాలు చేస్తూ.. హిట్లు కొడుతున్నారు.
2013లో విడుదలైన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో చివరి సారిగా హిట్ కొట్టాడు బాలీవుడ్ బాద్షా. 9 ఏళ్లుగా వరసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. మరోవైపు ఇదిలా ఉంటే ఇటీవల డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దొరకడం.. అతన్ని అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం తెలిసిందే.
ఈ వివాదంతో మరింతగా కుంగిపోయాడు. మీడియాకు ముఖం కూడా చూపట్టలేని పరిస్థితి ఎదురైంది. దీంతో పాటే దేశంలో ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ షారుఖ్ ఖాన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తోంది. నీచమైన కామెంట్లు పెడుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ దోషి అని తేలకముందే… పని గట్టుకుని ఆ ఫ్యామిలీపై విష ప్రచారం కూడా చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు షారుఖ్ ఖాన్. ఇటీవల గాన కోకిల లతామంగేష్కర్ మరణించిన సంగతి. ఆమె అంత్యక్రియలకు షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. అయితే ఆమెకు శ్రద్ధాంజలి ఘటించే సందర్భంలో మాస్క్ తీసి గాలి ఊదాడు షారుఖ్ ఖాన్. ఇక ఇది పట్టుకుని సోషల్ మీడియాలో మళ్లీ ట్రోలింగ్ మొదలయ్యాయి. షారుఖ్, లతామంగేష్కర్ పార్థీవ శరీరం వద్ద ఉమ్మివేశారని సిగ్గు లేదా అంటూ నెటిజెన్లు కామెంట్లు పెట్టారు. తాజాగా ఈ ఘటనపై నటి ఊర్మిళ ఫైర్ అయ్యారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం చనిపోయిన తర్వాత వ్యక్తి వద్ద నోటి నుంచి గాలి ఊదుతారు. ఇది తెలియని నెటిజెన్లు విమర్శిస్తున్నారంటూ.. ప్రార్ధనను కూడా ఉమ్మువేయడం అనుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామని ఆమె మండిపడ్డారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…