Trending News: రైతు ఖాతాలో రూ.15లక్షలు..! నిజం తెలిసి షాకైన రైతు..! ఇదెక్కడి గోలరా నాయనా అంటూ..
Trending News: ఎవరి ఖాతాలోనైనా రూ.15లక్షలు వచ్చి పడితే ఏం చేస్తాం. ఎక్కడి లేని సంతోషపడుతాం. ఆ తర్వాత అవి ఎక్కడి నుంచి వచ్చాయోనని ఆరా తీస్తాం. అవి పొరపాటున ఖాతాలో జమయ్యాయని తెలిస్తే షాక్ కు గురవుతాం. సరిగ్గా ఓ రైతుకు ఇలాగే జరిగింది.
వచ్చిన డబ్బులో రూ.9లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. తీరా ఆ నగదు తనకు రావాల్సింది కాదని తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. ఆ ఖర్చు చేసిన మొత్తం కట్టాల్సిందేనని అధికారులు చెప్పడంతో ఎలా అని తలపట్టుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్ జిల్లా దావర్వాడీ గ్రామంలో చోటుచేసుకుంది.
దావర్వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే.. చిన్నా చితకా పనులు చేస్తూ జీవించేవాడు. కొంతకాలం క్రితం అతను తన జన్ ధన్ బ్యాంకు ఖాతాను చెక్ చేసుకోగా రూ.15లక్షలు జమ అయి ఉన్నాయి.
2014 ఎన్నికల సమయంలో భాజపా అధికారంలోకి వస్తే వస్తే విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం తిరిగి వెనక్కి తెస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేయొచ్చని చెప్పారు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్న ధ్యానేశ్వర్ తన ఖాతాలో మోదీనే నగదు జమ చేసి ఉంటుందని సంబరపడ్డాడు. దానిలో రూ.9లక్షలు ఖర్చు పెట్టి ఓ చిన్న ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు. ఆ ఆనందంలోనే అతనికి అందిన ఓ లేఖ పిడుగులాంటి వార్తను తెచ్చింది. ‘జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాలో జమయ్యాయి. వాటిని మీరు తిరిగి చెల్లించాలి’ ఇది ఆ లేఖలోని సారాంశం. ఇది చదివి ఆ రైతు కంగుతిన్నాడు. ఖాతాలో మిగిలిన సొమ్మును తిరిగి చెల్లించినా.. ఖర్చు చేసిన డబ్బును ఎలా చెల్లించాలా ఆ రైతు తలపట్టుకున్నాడు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…