టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా వున్నారు.టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50 వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్ర బృందం ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు. సినిమాలు కేవలం ఏడు నిమిషాల సీన్ కోసం దాదాపుగా 67 కోట్లు ఖర్చు చేసారట.
ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సెట్ లో రామ్ చరణ్, కియారా అద్వాని కాంబోలో ఒక రొమాంటిక్ సీన్ ను చిత్రీకరిస్తున్నారట. ఇందు కోసం భారీ సెట్ వేయడానికి 40 కోట్లు ఖర్చు చేశారట. వీటితో పాటుగా ఒక పాటను కూడా చిత్రంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో కేవలం రెండు షెడ్యూల్స్ కె 112 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇక ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కోసం మరో 1.73 కోట్లు ఖర్చయింది. ఇలా సినిమా పూర్తి కాకముందే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక సినిమా పూర్తయ్యే సరికి మరింత ఖర్చు అవుతుందో, అంతేకాకుండా ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…