Sharukh Khan: సాధారణంగా సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయితే ఇలా సినిమా షూటింగ్లో యాక్షన్ సన్ని వేశాలలో నటించే సమయంలో అనుకోకుండా కొన్నిసార్లు హీరోలు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఇలా ప్రమాదానికి గురై కొంతమంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా షూటింగ్ లొకేషన్లో ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.అయితే ఈయన గత కొద్ది రోజుల క్రితం ఈ ప్రమాదానికి గురికాగా ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. షారుక్ ఖాన్ తన కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం గత కొద్దిరోజుల క్రితం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లారట అయితే అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు.
షారుఖ్ ఖాన్ ముక్కు తీవ్రమైన గాయం కావడంతో వెంటనే చిత్ర బృందం ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే ఆయనని పరీక్షించిన వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసి తనని డిశ్చార్జ్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇండియాకి తిరిగి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారని సమాచారం. ఇలా ఈ ప్రమాదంలో తన ముక్కుకు దెబ్బ తగలడంతో మైనర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారట. త్వరలోనే ఈ సర్జరీ కూడా జరగబోతుందని తెలుస్తోంది.
ఇలా షారుక్ ఖాన్ కి సంబంధించిన ఈ విషయం బయటపడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించింది. అయితే త్వరలోనే షారుక్ ఖాన్ నయనతార జంటగా నటించిన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…