General News

అంత్యక్రియలయ్యాయి.. ఆమె తిరిగొచ్చేసింది..!

ఎవరైనా మన బంధువుల లో చనిపోయారు అని తెలిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించడం సర్వసాధారణమే. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు కూడా ఎవరూ హాజరు కాకూడదని నిబంధన ఉండటంతో సమీప బంధువులు చనిపోయినప్పటికీ బంధువులు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే వారి అంత్యక్రియలలో పాల్గొంటున్నారు. ఈ విధంగా కరోన బారినపడి చనిపోయిందని తనకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ పెద్దకర్మ చేస్తుండగా సాక్షాత్తు చనిపోయిన మనిషి ఆటోలో దిగిరావడం చూసి అక్కడున్న వారంతా ఒక్క నిమిషం భయభ్రాంతులకు లోనైన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట క్రిస్టియన్‌పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేసేది. ఆమె భర్త ముత్యాల గడ్డయ్య కొలిమి పనిచేసేవాడు. అతడు మానసికంగా ఎంతో అమాయకంగా ఉంటాడు. ఈ దంపతులకు దావీద్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే గత నెల 12వ తేదీన గిరిజ కరోనా బారినపడి విజయవాడ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే తన కొడుకు కూడా కరోనా బారిన పడటంతో అతను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలోనే మే 15న గిరిజమ్మ చనిపోయిందని ఆస్పత్రి యాజమాన్యం ఒక మృతదేహాన్ని గిరిజమ్మ భర్తకు అప్పగించారు. గిరిజమ్మ కరోనాతో మృతి చెందిందని భావించి బంధువులు ఎవరు ఆమెను చూడటానికి సాహసం చేయలేదు. ఈ క్రమంలోనే ఆమె భర్త గడ్డయ్య ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. అదే విధంగా ఆమె కొడుకు దావీద్ కూడా కరోనాతో మృతి చెందాడు.

ఈ విధంగా తల్లి కొడుకులకు ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించి ఇద్దరికీ పెద్దకర్మ చేసే రోజు గిరిజమ్మ ఎంతో ఆరోగ్యంగా ఆటోలో ఇంటికి చేరుకుంది. ఒక్కసారిగా ఆమెను చూడగానే అక్కడున్న వారు ఎంతో భయాందోళన చెందారు. తరువాత ఈ షాక్ నుంచి తేరుకొని ఆమెను వివరంగా అడగగా అసలు విషయం బయటపడింది. తనని ఆసుపత్రి సిబ్బంది ఎంతో బాగా చూసుకున్నారని,తనకిప్పుడు కరోనా లేకపోవడం వల్లే ఆస్పత్రి సిబ్బంది తనకి ఆటోలో ఇక్కడికి పంపించారని విషయం తెలిపింది.

మే 12వ తేదీన ఆస్పత్రికి చేరిన గిరిజమ్మకి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి యాజమాన్యం ఆమెకు వేరేచోటికి మార్చారు. ఈ క్రమంలోనే అతని భర్త వెళ్లి ఆమెని వివరాలు అడగగా అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది చనిపోయిందని మార్చురీకి వెళ్లి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళ మృతదేహం చూపించగా మానసిక పరిస్థితి బాగా లేని గడ్డ తన భార్య మృతదేహమేనని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆమె కరోనా బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో ఆమెకు తన కొడుకు దావీద్ మరణించిన విషయాన్ని తెలియజేయలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago