కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కావడంతో చేయడానికి పనులు లేవు, దిక్కుతోచని స్థితిలో సొంతూర్లకు వెళ్ళిపోదాం అనుకున్న వలస కూలీలకు మృత్యువు వెంటాడింది. అత్యంత ఘోరమైన ప్రమాదం 19 మంది నిండు జీవితాలను చిదిమేసింది. చాలా మందిని ఆసుపత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. సొంతూళ్లకు వెళ్ళడానికి కేంద్ర అనుమతి ఇవ్వడంతో వలస కూలీలు అందరు సొంతూళ్లకు వెళదాం అనుకుని రెడీ అయ్యారు. అన్ని సర్దుకుని గురువారం నాటికి మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ చేరుకున్నారు. అప్పటికే రాత్రి అయిపోవడంతో అప్పటి వరకు నడిచి నడిచి అలసిపోయిన వారికి పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. ఎలాగో లాక్ డౌన్ నడుస్తుంది కదా ఇప్పుడు ట్రైన్లు రావు అనుకున్న వారు అక్కడే పడుకున్నారు. కానీ ఆ రైల్వే ట్రాక్ వారిపాలిట మృత్యు శకటం అవుతుందని వారు ఊహించలేకపోయారు.
తెల్లవారుజామున 5.15 గంటలకు అతివేగంతో ఓక గూడ్స్ రైలు నిద్రిస్తున్న వలస కూలీలపై దూసుకెళ్లింది. అక్కడే వారి జీవితాలను చిదిమేసింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో కర్మాడ్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది వలసకూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. రైల్వే ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…