అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య భారీగా నమోదవుతుండటం మరింత బాధించే అంశం. తాజగా అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ లో కరోనా కలకలం రేగింది. వైట్ హౌస్ లో పనిచేసే భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి దగ్గరగా మెలిగిన సిబ్బంది అందరిని క్వారంటైన్ చేసారు. అలాగే వారికి కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు.
అదే సమయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రిపోర్టులో ఇద్దరికే నెగెటివ్ వచ్చినట్టు తెలిపారు వైట్ హౌస్ సిబ్బంది. కాగా ఇప్పటికే అమెరికాలో 12,69,025 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 75,490 మంది మరణించగా.. మరో 2,13,113 మంది పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్చి అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం 9,80,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…