Singer Chinmayi: సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలో ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతున్నటువంటి ఈమె 2014వ సంవత్సరంలో నటుడు రాహుల్ రవీందర్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలా వీరిద్దరి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకు ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు.
ఇలా చిన్మయి తనకు కవల పిల్లలు జన్మించారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించకుండా నేరుగా పిల్లల గురించి తెలియజేయడంతో ఈమె సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇలా తనపై విమర్శలు రావడంతో చిన్మయి స్పందించారు.
ఈ క్రమంలోనే తాను సరోగసి ద్వారా పిల్లలను కనలేదని ఏకంగా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా పిల్లలు జన్మించిన తర్వాత వారితో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇప్పటివరకు తమ పిల్లల ఫోటోలను ఎక్కడ బయట పెట్టలేదు. అయితే తాజాగా ఈమె తన ఇద్దరి పిల్లల ఫోటోలను రివిల్ చేశారు.
ఈ క్రమంలోనే తన పిల్లలకు నేటితో ఏడాది పూర్తి అయ్యి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఈమె తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది ఒక గొప్ప ఆశీర్వాదం అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం చిన్మయి పిల్లలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతో మంది అభిమానులు చిన్మయి పిల్లలు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…