తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అయిన ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు సమాజంలో స్త్రీలపై జరిగే దాడుల గురించి స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా చిన్మయి స్పందిస్తూ ఇండస్ట్రీలో.. పెళ్లయిన తర్వాత అమ్మాయిలు నటించకూడదనే అంశం గురించి చర్చించారు. నా కుటుంబంలో ఒక వ్యక్తి పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాలలో ఎందుకు నటించకూడదో వివరించారు. అసలు పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాల్లో నటిస్తే తప్పేంటని? ఈ సందర్భంగా ఈమె ప్రశ్నించారు.
పెళ్లి తర్వాత అబ్బాయిలు ఇండస్ట్రీలో సినిమాలలో నటించవచ్చు.. కానీ అమ్మాయిలు నటించకూడదా? ఇలా వచ్చే ఆలోచనలకు గల కారణం ఏంటో ఆలోచించండని తెలిపారు. ఒక అమ్మాయి పెళ్లి కాకముందు ఎన్నో కలలు కంటుంది పెళ్లి తర్వాత ఆ కలలను తన శరీరాన్ని తన గర్భాన్ని కూడా ఒక అబ్బాయికి అంకితం చేయాలనే భావనలోనే ఇది పుట్టుకొచ్చిందని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ముగ్గురు హీరోయిన్లు పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాల్లో నటించకూడదనే సరిహద్దు రేఖను బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే, టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, ఇజ్రాయిల్ నటి గాల్ గాల్ గాడోట్ ఖండించారని ఈ సందర్భంగా చిన్మయి తెలిపారు. నిజానికి ఇలాంటి ఆలోచనలు అప్పట్లో లేవు అప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉంటే మహానటి సావిత్రి వంటి వారు మనకు పరిచయం అయ్యే వారు కాదని, అప్పట్లో ఈ విధమైనటువంటి ఆలోచనలు లేవు కనుక పెళ్లయిన తర్వాత కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగిందని ఈ సందర్భంగా చిన్మయి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…