ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే.. అది అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విషయం అని చెప్పవచ్చు. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు వీరిద్దరూ కలిసి ఉండాలని విడిపోకూడదని కోరుకున్నారు. తాజాగా సమంత చైతన్యల విడాకుల విషయంపై కాంట్రవర్సి బ్యూటీ శ్రీ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బ్యూటిఫుల్ కపుల్స్ సమంత నాగచైతన్య జంటను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఇలా విడాకులు తీసుకొని విడిపోకూడదని ఆమె కోరుకున్నారు.
తమిళనాడులో చాలా మంది ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ లో మాట్లాడగా సమంత పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని..సమంత ఏంటి అంత పెద్ద ఇంటికి కోడలు గా ఉండి ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఏంటనీ చాలామంది అనుకుంటున్నారని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తెలియజేశారు. పెళ్లి తర్వాత సమంత డ్రెస్సింగ్ విషయంలో చాలా మార్పులు జరిగాయని మనం ఎంత స్టార్ సెలబ్రిటీ అయినా మనం ఇండియాలోనే ఉన్నాము. ఇండియాలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి తన డ్రెస్సింగ్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు.
సంసారం అన్నాక ఎన్నో గొడవలు, పోట్లాటలు ఉంటాయి. అయితే వాటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో అన్యోన్యంగా ఉండవచ్చని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు. ఇండియాలో ఆడవాళ్లకు కొద్దిగా సహనం ఎక్కువ అంటారు అదే సహనంతో మీ సమస్యను పరిష్కరించుకొని నాగచైతన్య అన్నయ్య కానీ సమంత వదిన కానీ సర్దుకుపోతే మీ జీవితం ఎంతో బాగుంటుంది. మీరిద్దరూ కలిసి ఉండి ఎందరికో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సమంత నాగచైతన్య విడాకుల విషయం గురించి స్పందించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…