Singer Dhanunjay : శ్రీకాకుళం కి చెందిన సింగర్ ధనుంజయ్ ఇప్పటివరకు అతి తక్కువ కాలంలోనే ఎన్నో పాటలను పాడారు. అది కూడా చిన్న హీరోల నుండి పెద్ధ హీరోల వరకు అందరికీ సాంగ్స్ పాడిన ధనుంజయ్ గారు ఇటీవల పాడిన ‘తిరు సినిమాలోని నా మది పువ్వది’ సాంగ్ తో మరోసారి మంచి హిట్ అందుకున్నారు. నిజంగానే ధనుష్ ఆ పాట పాడాడేమో అనేలా వాయిస్ ధనుష్ కి సరిపోయింది. అతే ధనుంజయ్ పెద్దగా ఇంటర్వ్యూలలో కనిపించకపోవడం వల్ల తాను ఎన్నో పాటలు పాడినా ఆ పాట ధనుంజయ్ పాడాడనే విషయం తెలియదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పెళ్ళికి ముందే పడిపోయా…
ధనుంజయ్ తన కెరీర్ లో మొదట ట్రాక్స్ పాడుతూ స్టార్ట్ చేసారు. అనూప్ రూబెన్స్ వద్ద మొదలయిన కెరీర్ నేడు అందరు అగ్ర హీరోలకు పాటలు పాడుతూ టాప్ సింగర్ అయ్యాడు. ట్రాక్స్ పాడుతున్న సమయంలోనే గోపీచంద్ ‘లౌక్యం’ సినిమాలో సూడు సూడు సాంగ్ ట్రాక్ పాడగా అది నచ్చి మెయిన్ సింగర్ గా తననే పెట్టుకున్నారు. అలా హిట్ అందుకున్న ధనుంజయ్ మళ్ళీ ‘గోపాలా గోపాల’ సినిమాలో భాజే ఆ డోలు భాజే సాంగ్ కూడా ట్రాక్ పాడగా ఆ పాట విన్న పవన్ కళ్యాణ్ ట్రాక్ పాడిన అతనితోనే పాట కంటిన్యూ చేయమని చెప్పడంతో పవన్ కు పాట పాడే అవకాశం వచ్చిందంటూ చెప్పారు.
ఇక తన వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుతూ పెద్దలు కుదుర్చిన వివాహమే అయినా తనను పెళ్ళికి ముందు కలిసి తన కెరీర్ గురించి అన్ని విషయాలు చెప్పాను. అప్పటికి ఇంకా కెరీర్లో పెద్ధ హిట్స్ కూడా లేవు అంటూ తెలిపారు. అయితే తన భార్య ప్రియాంక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అప్పటికే జాబ్ చేస్తూన్నారట. తాను నువ్వు నీ కెరీర్ కోసం కష్టపడు నేను ఫైనాన్సియల్ గా సపోర్ట్ గా ఉంటాను అని భరోసా ఇచ్చిందని, తాను కెరీర్ లో ఇంత ఎదగడానికి తానిచ్చిన సపోర్ట్ కారణం అంటూ పెళ్ళికి ముందే తనకు పడిపోయానంటూ చెప్పారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ధనుంజయ్.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…