Pushpa 2: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో ప్రస్తుతం చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ట్రైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి. ఇలా ఈ సినిమా ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.ప్రస్తుతం శరగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోదని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలను 2024 ఏప్రిల్ 7వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే తేదీనే మేకర్స్ సైతం లాక్ చేశారని సమాచారం. ఇలా ఈ సినిమా కోసం మరో ఏడాది పాటు ఎదురు చూడక తప్పదని తెలుస్తోంది.
పుష్ప సినిమాతో భారీ అంచనాలను పెంచేసిన అల్లు అర్జున్ ఈ సినిమా పుష్ప సినిమాని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తాజాగా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఈ ఏడాది పార్టీ లేనట్టేనా పుష్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…