Singer Kousalya: కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమను నీడలా వెంటాడుతుంది.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి రోజూ ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఈ వైరస్ తో పోరాడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.
తాజాగా సింగర్ కౌసల్య సైతం కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలిపారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాను అని తెలిపారు.
ఈ వైరస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయని, రెండు రోజుల నుంచి బెడ్ పై నుంచి పైకి లేవలేక పోతున్నాను అంటూ ఈమె తెలియజేశారు. జ్వరంతో పాటు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉందని నిన్నటి నుంచి మందులు వాడటం కూడా మొదలు పెట్టానని తెలిపారు.
ఈ వైరస్ తో పోరాడి ఆరోగ్యవంతంగా తిరిగి త్వరలోనే మీ ముందుకు వస్తాననీ దయచేసి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాలను తెలియ చేశారు.ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది ప్రముఖులు ఈమెకు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…