Singer Kousalya: కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమను నీడలా వెంటాడుతుంది.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి రోజూ ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఈ వైరస్ తో పోరాడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.
తాజాగా సింగర్ కౌసల్య సైతం కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలిపారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాను అని తెలిపారు.
ఈ వైరస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయని, రెండు రోజుల నుంచి బెడ్ పై నుంచి పైకి లేవలేక పోతున్నాను అంటూ ఈమె తెలియజేశారు. జ్వరంతో పాటు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉందని నిన్నటి నుంచి మందులు వాడటం కూడా మొదలు పెట్టానని తెలిపారు.
ఈ వైరస్ తో పోరాడి ఆరోగ్యవంతంగా తిరిగి త్వరలోనే మీ ముందుకు వస్తాననీ దయచేసి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాలను తెలియ చేశారు.ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది ప్రముఖులు ఈమెకు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…