Singer Sai chandh wife Rajani : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమ వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు. నిజానికి సాయి చంద్ గాయకుడయితే ఆయన భార్య రజని నాట్యకారిని. వారిది ప్రేమ వివాహం కావడం విశేషం.
గుండెపోటుతో హాస్పిటల్ లో రజని…
సాయి చంద్ గారు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసేవారు. ఆయన గత వారం కుటుంబంతో కలిసి వ్యవసాయ క్షేత్రంకి వెళ్లగా అక్కడే కార్డియాక్ అరెస్ట్ కావడంతో హాస్పిటల్ లో చేర్చే సమయానికి ఆయన మరణించారు. ఆయన ఆకస్మాతుగా మరణించడంతో ఆయన భార్య రజని గుండె పగిలేలా రోధించారు.
ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆమె ఆ రోజు నుండి ఏడుస్తూనే ఉన్నారట. సరిగా ఆహరం తీసుకోక ఒత్తిడికి గురవడం వల్ల గుండె పోటు రావడంతో తాజాగా రజని గారిని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె ఏడుస్తూనే ఉన్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరము కావడం లేదంటూ బంధువులు బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యజం నిలకడగా ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…