Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ సింగర్స్ గా గుర్తింపు పొందిన వారిలో సునీత కూడా ఒకరు. కొన్ని వందలకు పైగా పాటలు పాడి తన మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న సునీత సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న సింగింగ్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.
ఇలా కెరీర్ పరంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న సునీత వ్యక్తిగత విషయాల వల్ల కొన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రెండవ వివాహం చేసుకోవడంతో సునీత మీద విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని సునీత రెండవ వివాహం చేసుకోవడంతో కొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సునీత చేసిన పనిని సపోర్ట్ చేస్తున్నారు.
సునీత తన మొదటి భర్తకు దూరమైన చాలాకాలం తర్వాత ఇటీవల రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సునీత తన పిల్లలు, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ కొంతమంది ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆమె గురించి వివిధ రకాలుగా విమర్శిస్తూ ఆమెని బాధపెడుతున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తాను రెండవ వివాహం చేసుకోవడానికి గల కారణాల గురించి వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ ” నా జీవితంలో జరిగే సంఘటనల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన రూమర్స్ క్రియేట్ చెయ్యడం వల్ల మేము చాలా బాధపడుతున్నాము. నా మొదటి భర్తతో విడిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. ఆ సమయంలో ఒంటరితనం కనిపించలేదు. కానీ ఇప్పుడు నా జీవితం మొత్తం పోయినట్టుగా అనిపించింది, ఆ సమయంలో రామ్ నాకు పరిచయ అయ్యాడు, స్నేహితులం అయ్యాం. పిల్లల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాము ” అంటూ తాను రెండవ పెళ్లి చేసుకోవడానికి గల కారణం గురించి చెప్పుకొచ్చింది .
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…