Sitaramam Movie: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించినటువంటి చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలయ్యి ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం భాషలలో కూడా మంచి విజయం సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేశారు.
ఇలా సెప్టెంబర్ రెండవ తేదీ హిందీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది.అందమైన ప్రేమ కథ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఇకపోతే ఈ సినిమాలో సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, రష్మిక వంటి సెలబ్రిటీలు సందడి చేశారు.
ఇక ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయి పాత్రలో కనిపించారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సీన్ లో ఏముంది అనే విషయానికి వస్తే…
రష్మిక సీతామహాలక్ష్మి కోసం వెతుకుతూ ఒక కాలేజ్ కి వెళుతుంది. ఇలా ఆమె టాక్సీలో వెళ్లగా టాక్సీ లోనే తన పర్స్ పాస్ పోర్ట్ మొత్తం మర్చిపోయి వెళ్తుంది. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి తనకు ఈ విషయం గుర్తు రావడంతో హడావుడిగా బయటకు వస్తుంది.అయితే అప్పటికి ఇంకా టాక్సీ డ్రైవర్ అక్కడే ఉండడంతో ఇంకా ఇక్కడే ఉన్నావా నీలాంటి వాళ్ళు ఇంకా ఇండియాలో ఉన్నారన్నమాట అని రష్మిక మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న టాక్స్ డ్రైవర్ ఇండియాలో అందరూ నాలాంటి వాళ్లే ఉన్నారు.మీ పర్స్ నేను తీసుకెళ్లి ఇండియా పరువును మీతో పాటు మీ దేశానికి పంపించలేను మేడం అంటూ తనకు ఇస్తారు. ఇలా ఎంతో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నటువంటి ఈ సన్నివేశం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…