Categories: FeaturedGeneral News

అందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్…!! కటింగ్ షాప్ కి వెళ్లినందుకు 6 గురికి కరోనా పాజిటివ్…!

కరోనా దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. గత గొద్దిరోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా భర్గావ్ అనే గ్రామంలో బార్బర్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవలే ఒక యువకుడు ఇండోర్ నుంచి తన స్వస్థలానికి వచ్చాడు. ఆ తరువాత ఏప్రిల్ 5న బార్బర్ షాపుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతనికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి కరోనా టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా అతని నుంచి ఆ షాపుకు వెళ్లిన మరో ఐదు గురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వారితో కాంటాక్ట్ ఉన్న మరో 12 మందిని క్వారంటైన్ కు తరలించి, గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అయితే బార్బర్ షాపులో వీరందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్ వాడినట్టు ప్రాధమికంగా నిర్ధారణ అయింది. అందువల్ల ఈ కరోనా తగ్గే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 1952 పాజిటివ్ కేసులు కామోదుకాగా, అందులో 92 మంది మృతి చెందారు. మరో 210 మంది ఈ మహమ్మారినుంచీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago