కరోనా దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. గత గొద్దిరోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా భర్గావ్ అనే గ్రామంలో బార్బర్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవలే ఒక యువకుడు ఇండోర్ నుంచి తన స్వస్థలానికి వచ్చాడు. ఆ తరువాత ఏప్రిల్ 5న బార్బర్ షాపుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతనికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి కరోనా టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా అతని నుంచి ఆ షాపుకు వెళ్లిన మరో ఐదు గురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వారితో కాంటాక్ట్ ఉన్న మరో 12 మందిని క్వారంటైన్ కు తరలించి, గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అయితే బార్బర్ షాపులో వీరందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్ వాడినట్టు ప్రాధమికంగా నిర్ధారణ అయింది. అందువల్ల ఈ కరోనా తగ్గే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 1952 పాజిటివ్ కేసులు కామోదుకాగా, అందులో 92 మంది మృతి చెందారు. మరో 210 మంది ఈ మహమ్మారినుంచీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…