కరోనా దేశవ్యాప్తంగా తన పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. గత గొద్దిరోజులుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా భర్గావ్ అనే గ్రామంలో బార్బర్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇటీవలే ఒక యువకుడు ఇండోర్ నుంచి తన స్వస్థలానికి వచ్చాడు. ఆ తరువాత ఏప్రిల్ 5న బార్బర్ షాపుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతనికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి కరోనా టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా అతని నుంచి ఆ షాపుకు వెళ్లిన మరో ఐదు గురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వారితో కాంటాక్ట్ ఉన్న మరో 12 మందిని క్వారంటైన్ కు తరలించి, గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. అయితే బార్బర్ షాపులో వీరందరికి ఒకే పనిముట్లు, ఒకే టవల్ వాడినట్టు ప్రాధమికంగా నిర్ధారణ అయింది. అందువల్ల ఈ కరోనా తగ్గే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 1952 పాజిటివ్ కేసులు కామోదుకాగా, అందులో 92 మంది మృతి చెందారు. మరో 210 మంది ఈ మహమ్మారినుంచీ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…