దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో ఇక్కడి వారు అక్కడే ఉండాలి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.. విమాన, రైల్వే, సముద్ర, రోడ్డు అన్ని మార్గాల ప్రయాణాలను ప్రభుత్వం రద్దు చేయడంతో రవాణా వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. దేనితో ఎంతో మంది భారతీయులు విదేశాల్లో చిక్కుపోయారు. విదేశీయులు కూడా భారత్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా చాలా మంది తమ ఆత్మీయులను ఈ లాక్ డౌన్ లో మిస్ అవుతున్నట్టు చెబుతున్నారు. సెలబ్రెటీ లు కూడా తమ వారు విదేశాల్లో చిక్కుకున్నారు అని బాధ పడుతున్నారు.
తమిళ హీరో విజయ్ తనయుడు కెనడాలో చిక్కుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు కూడా విదేశాల్లో ఇరుక్కుపోయాడు. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా సోదరుడు ఆనంద్ కూడా అమెరికాలో చిక్కుకుపోయారట. ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొన్నాళ్ల క్రితం తన తమ్ముడు ఆనంద్ భాటియాతో సరదాగా కింద కూర్చుని ఫోటోలకు పోజులిచ్చిన దృశ్యాలను మరియు తన కుటుంబ సభ్యులతో పంచుకున్న అనుభవాలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా నా తమ్ముడు యుఎస్ లో చిక్కుకుపోవడంతో తనను చాలా మిస్ అవుతున్నాను అంటూ భావోద్వేగంతో కామెంట్ చేసింది.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…