Son jumps from second floor of hostel - Heartbreaking mother's anguish!
గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను విషాదం చోటు చేసుకుంది. లండన్కు బయలుదేరిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన మేఘనీగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని జనారణ్యంలో జరిగింది. విమానం రెండు బహుళ అంతస్తుల భవనాలపై కూలడంతో ఒక్కసారిగా భీకర వాతావరణం నెలకొంది.
రమీలా అనే మహిళ తన కుమారుడి గురించి ఆందోళనగా మీడియాతో మాట్లాడుతూ.. “నా కొడుకు హాస్టల్లో ఉన్నాడు. లంచ్ బ్రేక్ కావడంతో భోజనం చేయడానికి వెళ్ళాడు. ఇంతలో విమానం హాస్టల్పై కూలిపోయింది. నా కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఫోన్లో మాట్లాడినప్పుడు, భయంతో వణికిపోతూ రెండో అంతస్తు నుంచి దూకేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతనికి గాయాలయ్యాయి” అని కన్నీటి పర్యంతమయ్యారు.
అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద పూనమ్ పటేల్ అనే యువకుడు తన వదిన గురించి దిగులుగా వివరిస్తూ.. “మా వదిన లండన్కు వెళ్తోంది. విమానం ప్రమాదానికి గురైందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఆమె ఎలా ఉందో తెలియక చాలా కంగారుగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
విమాన ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రయాణికుల బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారి ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.
విమానం కూలిన సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు హాస్టల్లోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సినిమా పరిశ్రమలో కొన్ని చిన్న మెరుగైన స్మైళ్లు, నటనా ప్రతిభను ఒక్క చూపుతో గుర్తించిపోవచ్చు. అలాంటి నటి ఆర్టి గణేష్కర్.…
వేసవి ఎండలు మండుతున్నాయి. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకే చాలామంది ఆహారంలో మార్పులు చేస్తూ చల్లదనాన్ని ఇచ్చే…
బియ్యం ఎంపిక – ఆరోగ్యం కోసం ఏది తినాలి? మన రోజువారీ ఆహారంలో అన్నం తప్పనిసరి. కానీ మార్కెట్లలో ఎన్నో…
ప్రదక్షిణం – భక్తి, ఆరోగ్యం, లేదా రెండూ కలసి? గుడికి వెళ్ళి దేవుడిని నమస్కరించడం తర్వాత, గర్భాలయం చుట్టూ చక్కగా…
సోషల్ మీడియా లేని రోజుల్ని ఈ తరం ఊహించుకోవడం కష్టమే. ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో ప్రపంచానికి…
రాత్రి 3 గంటలకు మెలకువ ఎందుకు వస్తుంది? రాత్రి అర్ధరాత్రి మూడు గంటలు, మొత్తం లోకమంతా సాయంకాలపు మధురనిద్రలో మునిగిపోయే…