soundarya: సౌందర్య మరణించిన ఇన్నేళ్లకు ఆస్తి కోసం గొడవ పడుతున్న కుటుంబ సభ్యులు?
soundarya: అలనాటి అందాలతార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య అదే పాపులారిటీతో రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బిజెపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.
ఈమె మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా ఉండిపోయారు.ఇక ఈ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్ నాథ్ కూడా మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా వీరిద్దరూ మరణించడంతో వీరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్తిపాస్తుల కోసం పెద్ద ఎత్తున గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మంజుల భర్త రఘు ఒక వైపు ఉండగా.. సౌందర్య సోదరుడు అమర్ భార్య మరోవైపు ఆస్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి 2 ఇండ్లు ఉండగా ఒకటి సౌందర్య, ఆమె సోదరుడు పేరు పై రాసి ఉండగా, మరొకటి అమర్ నాథ్ కుమారుడు సాత్విక్ పేరు పై ఉన్నట్లు సమాచారం.ఇకపోతే వీటితో పాటు హైదరాబాద్లో కొన్ని విలువైన ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఆస్తి కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సౌందర్య సోదరుడు అమర్ నాథ్ భార్య తన కొడుకు ఆస్తిపాస్తులు సౌందర్య తల్లికి, భర్తకు దక్కకుండా కోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు పలు ప్రశ్నలు వేయగ సౌందర్య తల్లి, భర్త దగ్గర సరైన సమాధానాలు లేకపోగా ఆస్తి మొత్తం సౌందర్య మేనల్లుడు సాత్విక్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…