Categories: FeaturedMovie News

SPB – K Viswanath – Chandramohan : ఈ ముగ్గురు అత్యంత దగ్గరి బంధువులు.. వీరు కలిసి చేసిన చిత్రం చరిత్రలో నిలిచిపోయింది.!!

కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి దేశం గర్వించదగ్గ అద్భుతమైన కళాఖండాలను రూపొందించి జాతి కీర్తి బావుటాను దశదిశలా వ్యాపింప జేశారు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. శాస్త్రీయ సంగీతం నేపథ్యంగా రూపొందించబడిన “శంకరాభరణం” చిత్రం ఎస్పీ బాలు కి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
అయితే గుంటూరులో బీఎస్సీ పూర్తి చేసిన కె.విశ్వనాథ్ ను తన తండ్రి సుబ్రహ్మణ్యం వాహినీ స్టూడియోలో ఆడియో గ్రాఫర్ నియమించాడు.

1966 “ఆత్మ గౌరవం”చిత్రం ద్వారా కె. విశ్వనాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు. ఇదే సంవత్సరంలో వాహినీ వారు నిర్మించిన (1966) “రంగులరాట్నం” చిత్రం ద్వారా చంద్రమోహన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వాహినీ సంస్థ తోనే కె.విశ్వనాథ్ చంద్రమోహన్ సినీ పరిశ్రమకు పరిచయమవడం గమనార్హం. ఒక సంవత్సరం తేడాతో 1967 “శ్రీ శ్రీ మర్యాద రామన్న” చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ముగ్గురు మధ్య ఉన్నది అన్నదమ్ముల సంబంధం. అవును అదెలాగంటే కె విశ్వనాథ్ తండ్రి సుబ్రహ్మణ్యం మొదటి భార్య చనిపోగానే రెండో పెళ్లి చేసుకున్నారు.

అయితే మొదటి భార్య చెల్లెల్ల కొడుకులే చంద్రమోహన్, బాలసుబ్రమణ్యం లు కాకపోతే సొంత అన్నదమ్ములు కాదు. వీరు కలిసి సినిమాలు చేస్తుండగానే వీరి మధ్య గల బంధుత్వం ఏమిటి అనే విషయం తెలియకుండా ఎవరి పని వారు చేసుకోవడం మంచిదనే ఉద్దేశ్యంతో దానికి కట్టుబడి వీరు అన్నదమ్ములనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన “శంకరాభరణం” చిత్రంలో చంద్రమోహన్ నటించగా ఎస్పీ బాలసుబ్రమణ్యం “శంకరా నాదశరీరాపరా” అనే అద్భుతమైన పాటను ఆలపించారు. అలా ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి చరిత్ర సృష్టించిన “శంకరాభరణం” చిత్రానికి పనిచేశారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

1 hour ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

1 hour ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago