Sr. NTR: మనదేశంలో క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా క్రికెట్ ఆటపై తమ అభిమానాన్ని కనపరుస్తూ ఉన్నారు.అయితే క్రికెట్ కేవలం క్రికెటర్స్ మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల మధ్య కూడా సీసీఎల్ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత 40 సంవత్సరాలుగా సెలబ్రిటీల మధ్య సీసీఎల్ జరిగి ఇందులో వచ్చిన డబ్బులను పలు చారిటీ ట్రస్టులకు విరాళంగా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే 1978 సంవత్సరంలో జరిగినటువంటి సీసీఎల్ మ్యాచ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఈ లీగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు వాటి ఎంతోమంది నటులు పాల్గొన్నారు.
ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కూడా ఈ సీసీఎల్ లో పెద్ద ఎత్తున పోటీకి దిగారు. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ బ్యాట్ చేతబట్టి ఓ రేంజ్ లో క్రికెట్ అదరు కొట్టాడని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బౌలింగ్ వేయగా సీనియర్ ఎన్టీఆర్ తన బ్యాట్ కు పని చెప్పారు.
ఇలా ఎన్టీఆర్ ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన పరుగులు పెట్టే విషయంలో కూడా ఎన్టీఆర్ తన మేనరిజం చూపించారు.ప్రస్తుతం అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా వీరి క్రికెట్ పై ఓ లుక్ వేసెయ్యండి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…