Sr. NTR: మనదేశంలో క్రికెట్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా క్రికెట్ ఆటపై తమ అభిమానాన్ని కనపరుస్తూ ఉన్నారు.అయితే క్రికెట్ కేవలం క్రికెటర్స్ మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల మధ్య కూడా సీసీఎల్ లీగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత 40 సంవత్సరాలుగా సెలబ్రిటీల మధ్య సీసీఎల్ జరిగి ఇందులో వచ్చిన డబ్బులను పలు చారిటీ ట్రస్టులకు విరాళంగా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే 1978 సంవత్సరంలో జరిగినటువంటి సీసీఎల్ మ్యాచ్ కు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య ఈ లీగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు వాటి ఎంతోమంది నటులు పాల్గొన్నారు.
ఇక బాలీవుడ్ సెలబ్రిటీల కూడా ఈ సీసీఎల్ లో పెద్ద ఎత్తున పోటీకి దిగారు. అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ బ్యాట్ చేతబట్టి ఓ రేంజ్ లో క్రికెట్ అదరు కొట్టాడని తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బౌలింగ్ వేయగా సీనియర్ ఎన్టీఆర్ తన బ్యాట్ కు పని చెప్పారు.
ఇలా ఎన్టీఆర్ ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈయన పరుగులు పెట్టే విషయంలో కూడా ఎన్టీఆర్ తన మేనరిజం చూపించారు.ప్రస్తుతం అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా వీరి క్రికెట్ పై ఓ లుక్ వేసెయ్యండి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…