Featured

Sravana Bhargavi : అన్నమయ్య కీర్తనలకు అవమానం.. శ్రావణ భార్గవిపై అన్నమయ్య వంశస్థుల ఆగ్రహం..!

Sravana Bhargavi : తెలుగు సినీ అభిమానులు అందరికి శ్రావణ భార్గవి సుపరిచితమే. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సింహ’ సినిమాలో ‘సింహమంటి చిన్నోడే’ పాటతో మొదటి విజయాన్ని అందుకుంది. తరువాత వెణు తిరిగి చూసుకునే పని లేకుండా వరుస పాటలతో అభిమానులను అలరించింది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల తన భర్త హేమ చంద్రతో విడాకులు తీసుకుంటున్నారు అన్న రూమర్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి ఒక పాట పాడి వివాదాలలో చిక్కుకుంది.

ఈ వివాదంలో అవసరం అయితే కోర్టుకు కూడా వెళతాం…

కొంత కాలంగా పెద్దగా పాటలు ఏవి పాడకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది శ్రావణ భార్గవి. ఈక్రమం లోనే తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. మన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యులు తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో మెప్పించిన కీర్తనను శ్రావణ భార్గవి పాడగా ఈ వివాదం రాజుకుంది. అన్నమయ్య పెద్ద కుమారుడు అయిన పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తితో పాడిన సంకీర్తనను శ్రావణ భార్గవి ఇలా కాళ్లు ఊపుతూ, శృంగార సంకీర్తనగా పాడి చిత్రీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఆమె తన అందాన్ని వర్ణించడం కోసం ఆ కీర్తనను పాడటం తో అగ్రహిస్తున్నారు.

శ్రావణ భారగవి చేసిన ఈ వీడియో పై అన్నమయ్య వంశస్తుడు అయిన హరినారాయణ చార్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పాట గురించి శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేము టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని, అలాగే అవసరం అయితే కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

9 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

9 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

11 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

11 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

12 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

12 hours ago